Friday, March 29, 2024
- Advertisement -

దారుణం.. కార్మికులను బలి తీసుకున్న ముష్కరులు..!

- Advertisement -

పాకిస్థాన్​ బలూచిస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. గుర్తు తెలియని ముష్కరులు.. 11 మంది బొగ్గు గని కార్మికులను బలితీసుకున్నారు. పనులకు వెళ్తున్న వారిని.. కిడ్నాప్​ చేసి సమీప కొండల్లోకి తీసుకెళ్లి కాల్పులకు ఒడిగట్టారు. వారిలో ఆరుగురు ఘటనా ప్రాంతంలోనే అసువులు బాయగా.. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

“బొగ్గు గని కార్మికులు పనికెళ్తుండగా గుర్తు తెలియని ముష్కరులు వారిని అపహరించారు. మచ్​ అనే ప్రాంతానికి దగ్గర్లో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి వారిపై కాల్పులు జరిపారు.” అని పోలీసులు తెలిపారు.దాడి అనంతరం ఘటనా ప్రదేశాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు, జిల్లా పరిపాలనా బృందం పరిశీలించింది.బలూచిస్థాన్​ ముఖ్యమంత్రి జమ్ కమల్​ ఖాన్.. ఈ ఘటనను ఖండించారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక కోరారు. ‘అమాయకుల ప్రాణాలు తీయడం ద్వారా ముష్కరులకు కలిగే లాభాలేంటని’ అన్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -