Thursday, May 2, 2024
- Advertisement -

జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు

- Advertisement -

వైసీపీ అధినేత ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు గ‌త ఆరు నెల‌లుకు పైగా ప్ర‌జాక్షేత్రంలో తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. దీనిలో భాగంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌ల నుండే కాకుండా సినీ ఇండ‌స్ట్రీ వారు కూడా త‌మ మద్ద‌తు తెలుపుతున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు జగన్ ను కలిశారు.

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో కొనసాగుతున్న పాదయాత్రలో జగన్ కలసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చోటా కే నాయుడు మాట్లాడుతూ, రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్రముఖులు జ‌గ‌న్‌కి మ‌ద్ద‌తు తెలిసిన సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -