Sunday, May 12, 2024
- Advertisement -

ప్రత్యేక కోర్టులో సీబీఐ కాసేపట్లో నిర్ణయం…

- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సీబీఐ కోర్టు అనుమ‌తి ఇస్తుందా ఇవ్వ‌దా అనే దానిపై ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. దీనికి సంబంధించి సీబీఐ కోర్టులో విచార‌ణ ముగిసింది. కోర్టు న్యాయ‌మూర్తి త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాల్సి ఉంది. వ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వ్యక్తిగత మినహాయింపును కోరేందుకు అనర్హుడని సీబీఐ, ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.

వంబర్ 2 నుంచి తాను పాదయాత్ర చేపట్టనున్నందున ప్రతి శుక్రవారమూ జరిగే కోర్టు విచారణ నుంచి మినహాయింపు కావాలని జగన్ కోరిన సంగతి తెలిసిందే. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టగా, మినహాయింపు ఇవ్వరాదని సీబీఐ పేర్కొంది.

తనకు ఆరు నెలల పాటు మినహాయింపు కావాలని జగన్ కోరగా, సీబీఐ స్పందిస్తూ, కోర్టు అనుమతించరాదని కోరింది. ఈ కేసులో న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వుంది. అంతకుముందు ఇదే విషయమై జగన్, హైకోర్టును ఆశ్రయించగా, సీబీఐ కోర్టులోనే పిటిషన్ వేసి అనుమతి తీసుకోవచ్చని సూచించిన సంగతి తెలిసిందే. అనుమ‌తి ఇస్తుందా లేదా అనేది రాజ‌కీయంగా ఉత్కంఠ‌కు తెర‌లేపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -