సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ఆరు రౌండ్లు ముగిసేసరికి బిజేపి అభ్యర్థి రఘునందన్రావు 2,667 ఓట్ల ముందంజలో ఉన్నారు.
ఆరో రౌండ్లో తెరాస 353 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి బిజేపి-20,226, తెరాస-17,559, కాంగ్రెస్-3,254 ఓట్లు వచ్చాయి. తొలి 5 రౌండ్ల వరకు బిజేపి ఆధిపత్యం చెలాయించింది. ఆరో రౌండ్లో మాత్రం తెరాసకు ఆధిక్యం లభించింది.23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరికాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణా లో ఆ పార్టీ అసలు ఉందా లేదా..?
టీడీపీ ని తల్లి కొడుకులు పూర్తి గా వదిలేసినట్లేనా..?