ఈ రోజు జరిగిన విజయవాడ సమవేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగాడు. ఈ సమవేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా చూస్తున్నా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదు. రెండేళ్లు గడిచిన ప్రజలకు చంద్రబాబు చేసింది ఏమీలేదు.
రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అసలు ప్రజలకు న్యాయం ఎలా చేయాలి అనే ఆలోచనే మానేసి తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాడు. ఈ రోజు టీడీపీ న్యాయకులు అందరు ఒక్కటై నామీద రోజుకో మాట మాట్లాడుతున్నారు. రోజుకో నింద వేస్తున్నారు. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయలేక నా మీద పడి ఏడస్తున్నాడు. ఈ రోజు ఓ సినిమా వచ్చి అందులో 14 రీల్స్ ఉంటే 13 రీల్స్ వరకు చంద్రబాబుని విలన్ ను చూసినట్లు చూస్తున్నారు. రోజుకో కట్టు కథ.. రోజుకో అబద్ధం. రోజూ చెప్పిందే చెప్పి ప్రజాలను మోసం చేస్తున్నారు.
చంద్రబాబుకి ప్రజలు అధికరం ఇచ్చారు. కానీ చంద్రబాబు వాళ్ళను దెబ్బకోడుతున్నాడు అని ఈ సమవేశంలో వైఎస్ జగన్ అన్నారు. మరో వైపు కాపుల గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి న్యాయకుడు ఉన్న ఒక్కటే లెకున్న ఒక్కటే అన్నారు. ఈ రెండు సంవత్సరాలలో చంద్రబాబు ఎలాంటి అన్యాయలు చేశాడు అనే విషయంపై ఓ బుక్ ని కూడా రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ బుక్ ప్రతి ఒక్కరు చదవాలి అని చెప్పారు. ఎందుకంటే ఈ బుక్ చదివితే అందులో ప్రజలకు చంద్రబాబు ఎలాంటి అన్యాయాలు చేసాడో తెలుస్తోంది అని అన్నారు.