Friday, May 17, 2024
- Advertisement -

ఐవైఆర్ రాసిన‌ ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్..

- Advertisement -

మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి’ పుస్తకాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఆవిష్కరించారు.ఈ కార్య‌క్ర‌మంలో ఐవైఆర్ కృష్ణారావుతోపాటు , సీపీఎం నేత మధు, సీపీఐ నేత రామకృష్ణ, సీనియర్ రాజకీయవేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. దేశంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడిన సందర్భాల్లో ఛండీగఢ్, భువనేశ్వర్‌, రాయ్‌పూర్‌, రాంచీ లాంటి రాజధానులను ఏ ప్రాతిపదికన కట్టారు, అసలు ప్రపంచ వ్యాప్తంగా రాజధానుల నిర్మాణాల అనుభవాలేంటి? తదితర అంశాలను కూలంకశంగా పరిశీలించి ఒక పుస్తకం రాశానని ఐవైఆర్‌ చెప్పారు. ఈ పుస్తకాన్ని వడ్డే శోభనాద్రీశ్వరరావు గారికి అంకితం చేస్తున్నానన్నారు ఐవైఆర్‌ కృష్ణారావు.

ఇక పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు. ఇదేదో ఒక పార్టీకి చెందినదిగా కాకుండా.. రాష్ట్ర ప్రజలందరికీ చెందినదే భావన ప్రజల్లో తీసుకురావాలని ఆకాక్షించారు పవన్ కళ్యాణ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -