తాడిపత్రిలో అధికార పార్టీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, పోలీసలు మధ్య మాటల వార్ కొనసాగుతోంది. ఇది చివరికి చలికి, చలికి గాలి వానలా మారుతోంది. తాడిపత్రి ప్రబోధానంద ఆశ్రమ వివాద సమయంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం చేపాయి. పోలీసులు కొజ్జాల్లా వ్యవహరిస్తున్నారంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకు పోలీసులు కూడా ఘటుగా కౌంటర్ ఇచ్చారు.
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు మండిపడ్డారు. రాజకీయ నేతలైనా, ఎవరైనా పోలీస్ వ్యవస్థని కించపరిచి మాట్లాడితే నాలుక కోస్తామంటూ సంఘం ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. జేపీ వ్యాఖ్యలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇదేమైనా సాయికుమార్ సినిమానా మీసాలు తిప్పడానికని సీఐని ఉద్దేశించి జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ వేరు, సినిమాలు వేరని చెప్పారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్ కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు అంటూ సవాల్ విసిరారు.
నీవు ఖాకీ బట్టలు విడిచి రా.. నేను కూడ సాధారణ బట్టలు వదిలివస్తానని జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. నీది నిజమైన మీసమైతే చెప్పాలని మాధవ్ పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా నాలుక కోసేస్తే… నా చిన్న నాలుకను కూడ తెగ కోసేయించుకొంటానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25వ తేదీ వరకు ఇక్కడే ఉంటా….. కత్తి పదునుగా లేకపోతే… పదును పెట్టుకోవాలని జేసీ మాధవ్ కు సూచించారు. పోలీసులు, జేసీ మధ్య గరుగుతున్న వివాదం ఇంకెంత దూరం వెల్తుందో చూడాలి.