టీడీపీ అధినేత – ఏపీ ముఖ్య మంత్రి నాయుడు కి తన సొంత పార్టీ వ్యక్తి నుంచి తలనొప్పి ఎదురైంది. అయితే ఈ తలనొప్పి కొత్త దేమీ కాదు అని చెప్పాలి. ఎప్పటి నుంచో జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు ని విసిగిస్తూనే ఉన్నారు. పోనీ వ్యతిరేకంగా గళం విప్పుతున్నార అంటే అదీ కాడు.
ఆయన ఇంటికి కూడా సమయం కేటాయించకుండా మొన్ననే మొదటి పుట్టిన రోజు జరుపుకొన్న మనవడితో నిమిషం కూడా ఆడుకోకుండా రాత్రీపగలు రాష్ట్రం కోసమే కష్టపడుతున్న చంద్రబాబు లైట్ గా క్లాస్ పీకారు జేసీ. వయసులో చంద్రబాబు కంటే పెద్దవాడైన జేసీ ముఖ్యమంత్రితో కాస్త చనువుగానే మాట్లాడుతారు.
ఆ క్రమంలోనే ఆయన గురువారం చంద్రబాబును ఉద్దేశించి కొన్ని సూచనలు చేశారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమెల్యే రాజశేకర్ రెడ్డి చేరిన సందర్భంగా విజయవాడ లో ఏర్పాటు చేసిన సభ లో జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు పాలనలో బిజీ గా ఉన్న చంద్రబాబు మనవడితో సరదాగా గడిపే సమయం కూడా వెచ్చించడం లేదు అనేది ఆయన కోపం.