Thursday, May 2, 2024
- Advertisement -

జేసీ చంద్రబాబును ఇరికించడానికే అలా మాట్లాడాడా..?!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంపై తెలుగుదేశం నేతలు తలా ఒకరకంగా స్పందిస్తున్నారు. ఒకరేమో ఇదంతా కుట్ర అని అంటారు. రేవంత్ వీడియోలతో సహా బాబు ఆడియో వరకూ అన్నీ తప్పుడు ఆధారాలు అని అంటారు. మరికొందరు ఏమో బాబు ఫోన్లను ట్యాప్ చేశారని.. ఇది దారుణమని, అన్యాయమని అంటారు.

ఇంకొందరు టాపిక్ ను పూర్తిగా డైవర్ట్ చేస్తూ.. హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని అనేస్తున్నారు.

ఇదిలా ఉంటే. .ఈ రచ్చలోకి చాలా లేటుగా ఎంట్రీ ఇచ్చాడు తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏ వ్యవహారంలోకి అయినా జేసీ బ్రదర్స్ ఎంట్రీ ఇస్తే కథ భలే రంజుగా మారుతుంది. ఇప్పుడు ఈ  వ్యవహారంలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించాడు. ఆడియో టేపుల్లో బాబు ఏం తప్పుగా మాట్లాడలేదు కదా? అని ప్రభాకర్ రెడ్డి అంటున్నాడు. ఇలా బాబు తరపున వకాల్తా పుచ్చుకొన్నట్టుగా మాట్లాడినా ఇందులోనే అసలు గుట్టు ఉంది. బాబుఎవరినీ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించలేదని జేసీ అంటున్నాడు.

బాబు ఎవరికీ డబ్బు ఇస్తానని ఆ ఆడియో టేపుల్లో లేదు.. అని ఈ తెలుగుదేశం అంటున్నా ఆ టేపులు మాత్రం బాబువే అని స్పష్టం చేసినట్టుగా అవుతోంది. ఈ విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బాబును వెనకేసుకు వస్తున్నట్టుగానే ఉన్నా పరోక్షంగా మాత్రం బాబు డీల్ లో పాల్గొన్నాడనే విమర్శలు తప్పవు. ఈ విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి బాబును రక్షిస్తున్నట్టుగానే మాట్లాడుతూ.. పరోక్షంగా ఇరికిస్తున్నాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -