Tuesday, May 21, 2024
- Advertisement -

తలుపుల బద్దలు కొట్టి తీసుకెళ్లారు

- Advertisement -

కాపు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో తలుపులు వేసుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడను ఆ గది తలుపుల బద్దలు కొట్టి మరీ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ముద్రగడ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  

ముద్రగడ అరెస్టును అడ్డుకునేందుకు కాపు నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారిపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. అనంతరం ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని, తుని ఘటనకు కొందరిని బాధ్యులను చేస్తూ అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయనను బలవంతంగా దీక్ష విరమింపజేసి ఆసుపత్రికి తరలించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -