పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అయన కొడుకు మోక్షజ్ణతో కలసి తూర్పుగోదావరి జిల్లాలోని పుల్లేటికుర్ర గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయితే ఈ పూజలను అత్యంత గోప్యంగా ఉంచారు. కనీసం అభిమానులకు కూడా సమాచారం లేదంటె
ఆలయంలో ప్రముఖ సిద్ధాంతి కారుపర్తి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో స్వామి వారికి చండీ హోమం, సుదర్శన హోమం, రుద్రాభిషేకంలో బాలకృష్ణ, మోక్షజ్ఞలు పాల్గొన్నారు. బాలకృష్ణ నూతనంగా నిర్మించే చిత్రానికి సంబంధించి స్వామివారి వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు నాగమల్లేశ్వర సిద్ధాంతి తెలిపారు. నాగ మల్లేశ్వరరావు సిద్దాంతిగారి జ్యోతిషం అంటే బాలయ్యకు అపార నమ్మకం. తాను ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆయన సలహా తీసుకుంటారు. కుమార్తెల వివాహాల విషయంలో ఆయన సూచనలు, సలహాలను పాటించారని అంటారు.
అయితే ఈపర్యటన మొత్తం గోప్యంగా సాగింది. చౌడేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంతోపాటు సిద్ధాంతి ఇంటి వద్దకు కూడా అభిమానులు, ప్రజలను అనుమతించలేదు. పూజల అనంతరం బాలకృష్ణ, మోక్షజ్ఞలు వేర్వేరు వాహనాల్లో వెళ్లిపోయారు.