Saturday, May 11, 2024
- Advertisement -

మీ కోరిక‌లు ఏమైనా ఉంటె ఇప్పుడే తీర్చుకోండి….

- Advertisement -

భూమి అంతానికి స‌మ‌యం ఆసన్నం అయ్యింద‌నే వార్త‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తున్నాయి. ఇక మిగిలింది 24 రోజులే…మీకోర్కెలు ఏమైనా ఉంటె ఇప్పుడే తీర్చుకోండంటూ వ‌స్తున్న వార్త‌లు వైర‌ల్‌గామారాయి. వ‌చ్చే నెల 20 నుంచి 23 తేదీల మధ్య భూమి అంతమైపోతుందని వారు చెబుతున్నారు. ఆ మూడు రోజుల వ్యవధిలో నిబిరు అనే గ్రహం భూమిని ఢీకొట్టనుందని, భూమి ముక్కలైపోయి సమస్త జీవాలూ అంతమై పోతాయని కాన్ స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ వెల్లడించారు.

మరో 24 రోజులు మాత్రమే మానవాళి మనుగడని, దీనిపై బైబిల్ తో పాటు గిజా పిరమిడ్ లోనూ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో కోరికలు ఏమైనా మిగిలుంటే, ఈ లోగానే వాటిని తీర్చుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు

సెప్టెంబర్‌ నెల మధ్యలో నిబిరు గ్రహం ఆకాశంలో ప్రపంచం మొత్తానికి స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అస‌లు నిబిరు గ్ర‌హం గురించి తెలుసుకుందాం. నిబిరు అనేది ఓ ఊహాజనిత గ్రహం. సౌర కుటుంబానికి అంచున ఈ గ్రహం ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని ప్లానెట్‌ ఎక్స్‌గా కూడా పిలుస్తారు. 2016 జనవరి నెలలో తొలిసారిగా నిబిరు గ్రహ ప్రస్తావన వచ్చింది. కొన్ని వందల ఏళ్ల క్రితం మన గ్రహాల కక్ష్యల్లోకి ప్రేవేశించిన నిబిరు గ్రహం వాటిని ఢీ కొట్టి సర్వనాశనం చేసింది.

ఇప్పుడు మ‌రో సారి భూ కక్ష్యలోకి నిబిరి ప్రవేశించనుందని కాన్‌స్పిరసీ థియరిస్ట్‌లు భావిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే జరగనుందని నమ్ముతున్న పరిస్థితి నెలకొంది. గ‌తంలో కూడా భూమి అంతం అవుతుంద‌నే వార్త‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేశాయి. మ‌రి ఇప్పుడు ఏజ‌రుగుతుందో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -