Saturday, May 18, 2024
- Advertisement -

అభివృద్ధి చేస్తా.. ఆదుకుంటా

- Advertisement -

తనను నమ్మితే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని, ఇతరులను నమ్మితే నష్టపోయేది ప్రజలేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నేను అభివృద్ధి చేసే వ్యక్తిని.. మరొకరు వినాశనం చేసే వ్యక్తి అని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్ధాపన కోసం వచ్చిన ఎపి సిఎం కడపను హార్టికల్చర్ హబ్ గా మారుస్తానన్నారు.

ఇక్కడ పండ్ల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, ఉద్యానవన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేష్ సౌకర్యం కలిగిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజలు మోసగాళ్లను నమ్మరాదని, జిల్లాలో క్రమంగా ముఠా సంస్కృతి తగ్గుతోందని అన్నారు. త్వరలో గాలేరు – నగరి ప్రాజెక్టును పూర్తి చేస్తామని, గండికోటకు నీళ్లిస్తామని చెప్పారు.

పండ్ల తోటల పెంపకంతో రైతుల ఆదాయం పన్నెండు రెట్లు పెరుగుతుందని, వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలకే ఆదాయం ఎక్కువగా ఉంటుదని అన్నారు. ఇక్కడ పండ్లకు మంచి గిరాకీ ఉంటుందని, అందుకే ఈ జిల్లాలోనే ఉద్యానరైతు రుణమేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టానని చంద్రబాబు వెల్లడించారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -