Sunday, May 19, 2024
- Advertisement -

తిరుపతిలో భారీ ఏర్పాట్లు

- Advertisement -

తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తిరుపతిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు మహానాడును నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 60 వేల మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఈ మహానాడుకు హాజరవుతారని భావస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అధికారంలో ఉండడంతో అక్కడ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఏవిధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.. ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో పార్టీ పరిస్ధతి, అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.

జాతీయ పార్టీగా మారిన తెలుగుదేశం పార్టీని ఇతర రాష్ట్రాల్లో ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై కూడా తీర్మానించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో పాల్గొనేందుకు గురువారం రాత్రి బయలుదేరి వెళ‌్తున్నారు. తన స్వగ్రామమైన నారావారి పల్లేకు వెళ్లి గురువారం రాత్రి అక్కడే ఉంటారు. శుక్రవారం ఉదయం తిరుపతి చేరుకుని మహానాడు పాల్గొంటారు. మంత్రులు, పలువురు నాయకులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -