Friday, May 3, 2024
- Advertisement -

పిల్ల‌ల కోసం పాముతో భీక‌ర పోరు సాగించిన త‌ల్లికుక్క‌..కానీ చివ‌ర‌కు..?

- Advertisement -

పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత వారిని కంటికి రెప్ప‌లా కాపాడుకోవడం తల్లిదండ్రు బాధ్యత. సృష్టిలో అది మనుషులైనా సరే.. జంతువులైనా సరే. అప్పుడే పుట్టిన పిల్ల‌ల‌ను కాపాడుకోవ‌డంకోసం త‌ల్లి కుక్క చేసిన స‌హాసం అద్భుతం. కాని చివ‌ర‌కు ఓడిపోయింది త‌ల్లి కుక్క‌.

బుజ్జిబుజ్జిగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ పప్పీలు… తల్లి చెంతన అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్న స‌మ‌యంలో ఎక్క‌డ‌నుంచి వ‌చ్చిందో తెలియ‌దుగాని ఓ తాచుపాము పిల్ల‌పాలిట య‌మ‌పాశంగా మారింది. త‌న పిల్ల‌ను పామునుంచి కాపాడుకోవ‌డానికి త‌ల్లి కుక్క పాముతో భీకర పోరే చేసింది. కాని ఎంత ప్ర‌య‌త్నించినా త‌న పిల్ల‌ల‌ను కాపాడులేకపోయింది.

నాలుగు పప్పీలను ఆ తాచు పాము తన విషపు కొరలతో కాటేసింది. పాము కాట్లకు మూడు పప్పీలు, అక్కడికక్కడే ప్రాణాలను వదిలాయి. ఒక్క పప్పీ మాత్రమే తాచుపాము కాటును తట్టుకుని మరీ, తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ సంఘటన అంతా ఒడిశాలోని భద్రక్‌ లో చోటు చేసుకుంది. తాచు పాము, శునకం భీకర పోరు ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే అటవీశాఖ అధికారులు ఆలస్యంగా రావడం వల్లే నాలుగు కుక్క పిల్లలు చనిపోయాయని స్థానికులు పేర్కొన్నారు.

ఈ వీడియో మీరు చూడండి.

blob:https://www.sakshi.com/822e6b7d-d8d4-476e-a11e-c3776eb2c8e7

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -