- Advertisement -
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవీంద్ర జ్ఞాపకార్ధం ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా వెంకటాపురంలో శుక్రవారం నాడు మూడు వందల జంటలకు సామూహిక వివాహాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వివాహాలకు ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. గురువారం నాడు ఈ వివాహాలకు సంబంధించి నూతన వధూవరులకు బట్టలు, పెళ్లికి సంబంధించిన ఇతర వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తును ముమ్మరం చేశారు. ఈ వివాహ వేడుకలు ముగిసిన తర్వాత అక్కడే నెలకొల్పిన పరిటాల రవీంద్ర విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారు.