Saturday, May 11, 2024
- Advertisement -

పశుపతినాథ్ సందర్శనకు సిద్ధం..!

- Advertisement -

నేపాల్‌ కాఠ్​మాండూలోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయాన్ని భక్తుల సందర్శన కోసం పునఃప్రారంభించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతపడిన పశుపతినాథ్ ఆలయాన్ని సుదీర్ఘకాలం తర్వాత భక్తుల సందర్శనార్థం తెరిచారు. ఆలయాన్ని ఇన్నిరోజులు మూసివేసినందుకు పశుపతినాథునికి ప్రాయశ్చిత్త ఆరాధనను అర్చకులు మంగళవారం నిర్వహించారు.

కొవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారమే భక్తులు పూజలు చేసేందుకు అనుమతిస్తున్నామని పశుపతినాథ్ అభివృద్ధి సంస్థ తెలిపింది. ప్రత్యేక పూజలు, శ్లోకాలు, కర్మ కార్యకలాపాలు క్రమంగా ప్రారంభిస్తామని పేర్కొంది. భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -