నిన్నంతా న్యూస్ లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గురించే చూసాం. ఏ టీవీ పెట్టినా పవన్ కళ్యాణ్ యొక్క విశేషాలే. పవన్ – ముఖ్యమంత్రి ల భేటీ అంతటి ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రిని కలిసిన పవన్ కళ్యాణ్ తాను బాక్సైట్ గనుల విషయాలతో పాటు ఇంకా చాలా విశేషాల గురించి మాట్లాడాను అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా విషయం లో ప్రధానమంత్రి మోడీ నుంచి సరైన రెప్లై రాకుండా తాను ఏమీ మాట్లాడలేను అని మోడీ రాష్ట్రాన్ని మోసం చేసారు అని తాను అనుకోవడం లేదు అని బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనుకుంటున్నా అని అన్నారు కళ్యాణ్. ఈ భేటీ లో పవన్ కళ్యాణ్ ఆహార్యం అత్యంత ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ పంచె తో రావడం టాప్ టూ బాటం పంచెలో కనపడ్డం ఆసక్తి ని రేపుతోంది. పవన్ మాటలకంటే ఆయన ఆహార్యం నిన్న చాలా ఆసక్తిగా అనిపించింది. పవన్ అలా పంచె కట్టులో ఉండడం చూసి ఫాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాలు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం పవన్ కార్తీక మాసం దీక్ష లో ఉన్నారు అని తెలుస్తోంది. దానికోసమే ఆయన ఉదయం పూజ పూర్తి చేసి ఆ తరవాత ఇంటినుంచి విజయవాడ కి అవే దుస్తుల్లో బయలు దేరారు అని తెలుస్తోంది. నలభై ఐదు రోజుల పాటు ఆయన ఒక పూటే భోజనం చేస్తూ ఈ దీక్ష కొనసాగిస్తారు అని తెలుస్తోంది.