జననేత అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దూకుడు పెంచాడు. రాజధాని భూసమీకరణ అంశాన్ని పవన్ సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హడావిడిగా సినిమా షూటింగ్ ఆపేసి హైదరాబాద్ చేరుకున్నాడు.
వచ్చే ఆదివారం ఏపి సిఎం చంద్రబాబుతో కలిసి భూసేకరణ అంశాన్ని చర్చించబోతున్నట్లు సమాచారం. ఈ రోజు పవన్ చేసిన ట్వీట్స్ చూస్తుంటే.. టిడిపి, బిజేపి పార్టీలపై పోరాటానికి సిద్దమయినట్లు తెలుస్తోంది. రామ్ జెఠ్మలాని చెప్పిన సూచనల ప్రకారం ఒక రాజకీయ పార్టీ జాతి ప్రయోజనాల కోసం పని చేస్తున్నంత కాలం దానికి మద్దతివ్వడం ధర్మమని, ఐతే, ఆ రాజకీయ పార్టీ విధానాలు జాతికి నష్టం కలిగిస్తున్నప్పుడు కూడా ఆ పార్టీకి మద్దతివ్వడం జాతికి ద్రోహం చేసిన దాంతో సమానం.
రాజకీయాల్లో ఎల్లప్పుడూ జాతి ప్రయోజనాలే పరమావధిగా వుండాలన్న జెఠ్మలానీ అభిప్రాయాలను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వచ్చినప్పటి నుంచి మీడియా ఛానల్స్లో టిడిపికి పవన్ గుడ్బై చెబుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. పవన్ దూకుడు ఎంత దూరమో చూడాలి.