Monday, May 6, 2024
- Advertisement -

తెలంగాణలో టిడిపి బలోపేతానికి పాదయాత్ర – రేవంత్ రెడ్డి

- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తాను పాదయాత్ర చేపట్టనున్నానని ఆ పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకూ ఈ పాదయాత్రను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హన్మకొండలో జరిగిన టిడిపి విస్తృతస్ధాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజకీయంగా బిక్ష పెట్టి ఎన్నో పదవులు కట్టపెట్టిన పార్టీకి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్రోహం చేశారని అన్నారు. టిఆర్ఎస్ లో దయాకర్ రావు చెల్లని పైసాగా మారిపోయారన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు దయాకర్ రావుకు పదవులు ఇవ్వకపోతే ఆయన ఇంకా రేషన్ డీలర్ గానే ఉండి పోయే వారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిడిపిలో ఎన్నో పదవులు, అధికారం అనుభవించిన దయాకర్ రావు ఇప్పుడు కెసిఆర్ ఫాం హోం వద్ద పడిగాపులు పడే స్ధితిలో ఉన్నారన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -