Friday, April 26, 2024
- Advertisement -

అప్పుడు పదవి తీసేశారు.. ఇప్పుడు మళ్ళీ జగనే పదవి ఇచ్చారు..!

- Advertisement -

రాష్ట్ర మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవల్ని వినియోగించుకునేందుకు బదిలీ చేస్తున్నట్టుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్​కు చెందిన ఠాకూర్ ..గతంలో ఏసీబీ డీజీగా పనిచేశారు.

గత ప్రభుత్వ హయాంలో డీజీపీగా ఉన్న ఆయనను జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆ పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నియమించింది. ఇప్పుడు ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ ఎండీగా నియమించిన ప్రభుత్వం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -