- Advertisement -
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. మూడ్రోజుల కస్టడీ అనంతరం మారేడ్పల్లిలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆ తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు.
అఖిలప్రియ తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. ఎల్లుండి విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అంతకుముందు అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బేగంపేట పీహెచ్సీలో కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్గా నిర్ధరణ అయింది. గాంధీ ఆస్పత్రిలో ఈసీజీతో పాటు పలు పరీక్షలు నిర్వహించారు. గైనకాలజీ విభాగంలోనూ అఖిలప్రియకు పరీక్షలు చేయించారు.