- Advertisement -
ఏడేళ్ల కిందట తప్పిపోయిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ సోదరి మైసుని దేవిని తిరిగి కలుసుకున్నారు కుటుంబ సభ్యులు. ఇన్నాళ్లు మనోవేదనకు గురైన ఆమె.. రాజస్థాన్ భరత్పుర్లోని అప్నాఘర్ అనే ఆశ్రమంలో చికిత్స పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.
పూర్తిగా కోలుకున్న అనంతరం మైసుని దేవి తెలిపిన వివరాల మేరకు ఆశ్రమ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చివరకు సోదరుడు బాబూలాల్ మరాండీని కలుసుకున్నారు.సోదరి ఆచూకీ తెలియడంపై ఆనందం వ్యక్తం చేశారు బాబూలాల్. తన తోబుట్టువును తిరిగి కలిపిన ఆశ్రమానికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు.