Saturday, May 4, 2024
- Advertisement -

ఏడేళ్ల తరువాత కలిసిన మాజీ సీఎం తోబుట్టువు..!

- Advertisement -

ఏడేళ్ల కిందట తప్పిపోయిన ఝార్ఖండ్​ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్​ మరాండీ సోదరి మైసుని దేవిని తిరిగి కలుసుకున్నారు కుటుంబ సభ్యులు. ఇన్నాళ్లు మనోవేదనకు గురైన ఆమె.. రాజస్థాన్ ​భరత్​పుర్​లోని అప్నాఘర్​ అనే ఆశ్రమంలో చికిత్స పొందినట్లు నిర్వాహకులు తెలిపారు.

పూర్తిగా కోలుకున్న అనంతరం మైసుని దేవి తెలిపిన వివరాల మేరకు ఆశ్రమ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చివరకు సోదరుడు బాబూలాల్​ మరాండీని కలుసుకున్నారు.సోదరి ఆచూకీ తెలియడంపై ఆనందం వ్యక్తం చేశారు బాబూలాల్​. తన తోబుట్టువును తిరిగి కలిపిన ఆశ్రమానికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -