Tuesday, April 30, 2024
- Advertisement -

మీడియా రంగంలోకి మెఘా

- Advertisement -

మెఘా ఇంజినీరింగ్ కంపెనీ గురించి తెలియ‌ని వారుండ‌రు. ఇన్ ఫ్రా , ప‌వ‌ర్‌, నిర్మాణ రంగంలో అనేక భారీ ప్రాజెక్టుల‌ను అనుకున్న టైంలో పూర్తి చేసి రికార్డులు సృష్టించింది. వీటితో పాటు అనేక రంగాల‌కు విస్త‌రించింది. ఇప్ప‌టికే మెగా కంపెనీ ఇన్‌ఫ్రారంగంలో దేశంలో ఒక సుస్తిత‌ర స్తానాన్ని సంపాదించుకుంది.

తాజాగా మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతోంది. ఇప్ప‌టికే కొన్ని మీడియా సంస్త‌ల‌లో భాగ‌స్వామిగా ఉన్న మేఘా ఇప్పుడు సొంతంగా మీడియా సంస్థ‌నే కొనుగోలు చేసింద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. మీడియాలో నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న టీవీ9 ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. గ‌తంలో కూడా టీవీ9ను అమ్మేశార‌ని అనేక వార్త‌లు వ‌చ్చి నా చివ‌ర‌కు మేఘా చేతికి రావ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది.

దీనికి సంబంధించిన ఒప్పందం పూర్తి అయింద‌నీ సెప్టెంబర్‌ నెలలో టీవీ9 మేఘా చేతికి రావొచ్చని అంటున్నారు. ప్రచారానికి దూరంగా ఉండే మేఘా కృష్ణారెడ్డి తన అవసరాలకోసం కాకుండా బహుశా ఆయన ఆత్మీయుల సలహా, సూచన, కోరిక మేరకు టీవీ9ను కొని ఉండవచ్చని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా టీవీ9గాని మెఘా కంపెనీగాని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -