వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు చేపడుతున్న ఉద్యమంతో రైల్వేశాఖకు రూ.2400కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు.
వ్యవసాయ చట్టాలపై ఆందోళనలో భాగంగా పంజాబ్లో సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 24 వరకు రెండు నెలలపాటు రైలు సేవలు పూర్తిగా రద్దయ్యాయి. ప్రస్తుతం నడుస్తున్నా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు చేపడుతున్న ఉద్యమంతో రైల్వేశాఖకు రూ.2400కోట్ల నష్టం వాటిల్లిందని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు.
”బియాస్, అమృత్సర్ మధ్యలో ఉన్న కొన్ని రైల్వే లైన్లను రైతులు ప్రస్తుతం నిర్బంధించారు. దీనిని అధిగమించడానికి తార్న్ తరన్ మీదుగా మరొక మార్గాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ తక్కువ సామర్థ్యంతో ఎక్కువ దూరం ప్రయాణమార్గం అయినందున కావాల్సినదానికంటే తక్కువ రైళ్లను నడుపుతున్నాం. గూడ్స్ రైళ్లు సైతం ప్రభావితమయ్యాయి. మా అంచనా ప్రకారం రూ.2400 కోట్ల నష్టం వాటిల్లింది అని తెలిపారు.