- Advertisement -
గ్రేటర్ ఎన్నికలు నోటిఫికేషన్ కు ముందే వేడిని పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలను ఇటు టిడిపి అటు అధికార టిఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న అధికార పార్టీ ఎత్తులను చిత్తు చేయడానికి ప్రణాళికలు రెడీ చేస్తోంది టీడీపీ.
జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీడీపీ తన అస్ర్తాలను రెడీ చేసుకుంటుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఓవైపు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కలిగిస్తూనే టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు రేవంత్ గులాబి దళంపై దండెత్తారు.
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్న నేతలు తొలగించిన ఓట్ల విషయంపైనా విసృత ప్రచారం కల్పించడానికి రెడీ అవుతున్నారు.
