Tuesday, April 30, 2024
- Advertisement -

జ‌గ‌న్ పై క‌త్తితో దాడి చేసిన శ్రీనివాస్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మం..ఆసుప‌త్రిలో చేరిక‌

- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ పై శ్రీనివాస్ అనే యువ‌కుడు కోడి క‌త్తితో దాడి చేసిన సంఘ‌ట‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపింది. దీనిపై వైసీపీ , టీడీపీ ల మ‌ధ్య భారీస్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఈ కేసును ఎన్ ఐఏకు ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం నిందితుడు శ్రీనివాస్ ప‌రిస్థితి విష‌యంగా ఉన్న‌ట్లు స‌మాచారం. పోలీసులు కూడా ఈ విష‌యాన్ని గోప్యంగా ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావు తీవ్ర అస్వ‌స్థ‌త‌న‌కు గుర‌య్యాడు. దీంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.నిన్న రాత్రి పది గంటల తర్వాత ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలోని ప్రిజనర్స్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

అత‌ని ఆరోగ్యంగురించి అటు పోలీసులు గాని…ఇటు డాక్ట‌ర్లుగాని ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడం లేదు. ఈ సాయంత్రానికి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోతే… అతన్ని కాకినాడ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -