- Advertisement -
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవలే చార్జ్షిట్ సైతం ఎన్ఐఏ దాఖలు చేసింది. అయితే, ఎన్ఐఏ విచారణపై విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
ఇకపై ఈ కేసును రహస్యంగా విచారించాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఈ కేసులో నిందితులు, న్యాయవాదుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కోర్టులో జరిగే విచారణకు సంబంధించిన వివరాలు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో ప్రచరించడానికి కూడా వీల్లేదని పేర్కొంది.
