Monday, May 20, 2024
- Advertisement -

ఎలా అడ్డుకుందాం!

- Advertisement -

ఓ వైపు.. తమకు అవకాశం ఉన్న ఒక్కగానొక్క రాజ్యసభ సీటును.. ఎగదన్నుకు పోయేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ తో.. వైసీపీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరుగా సైకిల్ ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. దీంతో.. జగన్ క్యాంప్ డీలా పడుతోంది.

ఇప్పుడు వైసీపీ నాయకత్వం ముందు ఒకే సవాలు కనిపిస్తోంది. పార్టీని సంక్షోభంలో పడకుండా ఎలా కాపాడుకోవడం.. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు తక్షణ చర్యలు తీసుకోవడం.. అనుకున్నట్టు విజయసాయిరెడ్డిని రాజ్యసభకు పంపించడం. ఇదే.. ఇప్పుడు వైసీపీ మెయిన్ టార్గెట్ గా పరిశీలకులు చెబుతున్నారు.

అందుకు.. తన అనుచరగణంతో పాటు.. పార్టీలో సీనియర్ నాయకులు, రాజ్యాంగంపై పట్టు ఉన్న ప్రముఖులతో జగన్ మంతనాలు నడిపిస్తున్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోతే.. వారిపై కచ్చితంగా అనర్హత వేటు పడేలా చేయడమే.. పార్టీ లక్ష్యంగా చెబుతున్నారు.

అందుకు రాజ్యాంగ పరంగా అనుకూలంగా ఉన్న అన్ని అంశాలపై జగన్ స్టడీ చేయిస్తున్నారని.. అవసరం వచ్చినపుడు అన్ని అస్త్రాలూ బయటికి తీసి.. టీడీపీ దూకుడును అడ్డుకోవడం ఖాయమని.. పార్టీ నేతలు కూడా చెబుతున్నారు. చూస్తుంటే.. టీడీపీకి.. జగన్ గట్టి సవాలే విసిరేట్టు కనిపిస్తున్నారు. ఈ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -