ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ చిత్తూరుకు చెందిన యువకుడు సుధాకర్(26) ఆత్మహత్య చేసుకున్నాడు. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన రామచంద్ర, సరోజమ్మల కుమారుడు సుధాకర్ చేనేత కార్మికుడిగా పనిచేస్తున్నాడు. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు. ప్రత్యేక హోదా మన హక్కు’ అని సూసైడ్ నోట్ రాసి, సుధాకర్ ప్రాణాలు తీసుకున్నాడు. దీనిపై జగన్ స్పందించారు.
ప్రత్యేక హోదా కోసం తొందరపడి ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, అందరం కలిసి పోరాడి సాధించుకుందామని జగన్ విజ్ణప్తి చేశారు. సుధాకర్ ఆత్మహత్యపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధాకర్ ఆత్మహత్య విషయం గురించి తెలుసుకున్న వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇలా తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని, తల్లి తండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని విజ్ఞప్తి చేశారు. బతికుండి పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. సధాకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.