Tuesday, May 21, 2024
- Advertisement -

ఆప‌రేష‌న్ గ‌రుడ‌..క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ క‌త్వం చంద్ర‌బాబే…వైసీపీ

- Advertisement -

వైఎష్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై దాడి జ‌రిగిన త‌ర్వాత మ‌రోసారి తెల‌ర‌పైకి వ‌చ్చింది ఆప‌రేష‌న్ గ‌రుడ‌. ఇప్పుడే ఇదే హాట్‌టాఫిక్‌గా మారింది. నటుడు శివాజీ చెప్పినట్టు జగన్‌పై దాడి ఆపరేషన్ గరుడలో భాగమేనేమో అని సీఎం అనుమానం వ్యక్తం చేశారు. బాబు చేసిన వ్యాఖ్య‌ల‌కు వైసీపీ కౌంట‌ర్ ఇచ్చింది.

విమానాశ్రయంలో పోలీస్ అధికారులకు తెలియకుండా కత్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. శ్రీనివాస రావు వైసీపీ కార్యకర్త అయితే… ఫ్లెక్సీని పసుపు రంగు కలర్‌లో ఎలా వేశారని ఆయన ప్రశ్నించారు వైసీపీ కార్యకర్త ఎవరూ కూడ పసుపు రంగులో ప్లెక్సీలు వేయరని ఆయన అబిప్రాయపడ్డారు.

ఇటీవల కాలంలోనే శ్రీనివాసరావు కుటుంబానికి రెండు దఫాలు బ్యాంకు రుణాలను మంజూరు చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీనివాసరావును ప్రలోభపెట్టి టీడీపీ కార్యకర్తగా మార్చారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ దాడి జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

వైఎస్ జగన్ పై దాడి జరిగిన వెంటనే.. ఇది తాము చేయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులతో పాటు సాక్షాత్తూ డీజీపీ సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఆపరేషన్ గరుడ’ కుట్రలో భాగంగా జగన్ పై దాడి జరిగిందనీ, దీని వెనుక స్క్రీన్ ప్లే మొత్తం చంద్రబాబునేనని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -