Saturday, May 18, 2024
- Advertisement -

స‌భ‌ను సాగ‌నివ్వకుండా ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్నారు: అమీత్‌షా

- Advertisement -

పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను స‌జావుగా సాగ‌నివ్వ‌డం ప్ర‌తిప‌క్షాల‌కు ఇష్టంలేద‌ని భాజాపా అధ్య‌క్షుడు అమిత్‌షా ఆరోపించారు. స‌మావేశాలు ప్రారంభం అయిన‌ప్ప‌టినుంచి వైసీపీ,టీడీపీ కేంద్రంపై అవిశ్వాతీర్మానం ప్ర‌వేశ పెట్ట‌డం వెంట‌నే వాయిదా ప‌డ‌టం తెలిసిందే. తాజాగా దీనిపై క‌మ‌ళం బాస్ స్పందించారు.

అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తమకు తగినంత మెజార్టీ ఉందన్నారు. ఉభయసభలను ప్రతిపక్షాలు స్తంభింపజేయడంపై సరికాదని, విపక్షాలు లేవనెత్తుతున్న ప్రతి అంశంపైనా తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ సభను సాగనివ్వడం లేదని చెప్పుకొచ్చారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని 25 ఎంపీ స్థానాలకు గాను 21 స్థానాలకు పైగా కైవసం చేసుకోవాలని అమిత్ షా తమ తన పార్టీ నేతలతో అన్నారు. ఇదే తాను 2019 ఎన్నికల కోసం తమ నేతలు, కార్యకర్తలకు ఇస్తోన్న లక్ష్యమని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -