Monday, May 20, 2024
- Advertisement -

మేనేజ్‌మెంట్ గురూ… ఫిరాయింపు ఎమ్మెల్యేలందరికీ సూపర్ ఝలక్ ఇవ్వనున్న చంద్రబాబు

- Advertisement -

రెండు మూడేళ్ళు అధికారాన్ని ఎంజాయ్ చేయడం కోసం విలువలకు తిలోదకాలిచ్చేశారు. డబ్బుకు, ఇతర లాభాలకు ఆశపడి వ్యక్తిత్వంపై మచ్చ వేసుకున్నారు. ఇకపై ఏ నాయకుడూ కూడా నమ్మని పరిస్థితిలో పడ్డారు. తీరా చూస్తే ఒత్తిడి తట్టుకోలేక జీవితాలు వదులుకున్నవాళ్ళు, అవినీతి వాటాలో సింహభాగం చిన్న బాస్‌కి చెల్లించలేక సతమతమవుతున్నవాళ్ళు ఉన్నారు. సీట్ల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిధులు…..ఇలా ఎన్ని ప్రజలకు సంబంధించిన విషయాల్లో మోడీ అన్యాయం చేసినా మాట్లాడని చంద్రబాబు……..సీట్లు పెంపు కేన్సిల్ అనేసరికి మాత్రం పొత్తులు తెంచుకునేవరకూ వచ్చాడు.

ఆ విషయం పక్కనపెడితే సీట్లు పెరగవని తేలిపోయిన నేపథ్యంలో ఇప్పుడిక ఫిరాయింపు ఎమ్మెల్యేల బ్యాచ్‌కి టిక్కెట్స్ ఇవ్వడం ఎలా? అలాగే జంపింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారు. వెన్నుపోటు రాజకీయాలతో ఎదిగొచ్చిన చంద్రబాబు మామూలుగానే ఎవ్వరినీ నమ్మడు. ఇక నమ్మి టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకున్న నాయకుడికే పంగనామాలు పెట్టి వచ్చిన నాయకులను అసలు నమ్ముతాడా? అందుకే ఇప్పుడు తెలివిగా న్యాయవ్యవస్థతోనే మొత్తం ఫిరాయింపు బ్యాచ్‌కి చెక్ పెట్టడానికి రెడీ అయ్యాడు చంద్రబాబు. తన అనుచరుడు, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో రాజకీయం నడిపిస్తున్నాడు చంద్రబాబు. తాను తెరవెనకాలే ఉంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు పడేలా ప్లాన్ చేస్తున్నాడు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేలా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -