Thursday, May 16, 2024
- Advertisement -

ఏపీలో మ‌రో కుమార స్వామి ప‌వ‌న్ … కాబోతున్నాడా..?

- Advertisement -

ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌ని ప‌ద‌వుల‌కోసం కాద‌ని చెప్పిన ప‌వ‌న్ త‌ర్వాత త‌న రూటు మార్చారు. అప్పుడే సీఎం సీటుపై ప‌వ‌న్‌కు మోజు పెరిగిన‌ట్టుంది. అందుకే న‌న్నును సీఎంను చేయండంటూ ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌జ‌న‌లు వేడుకొంటున్నారు. ఇదంతా బాగానే ఉంది. 2019 ఎన్నిక‌లు జ‌ర‌గాలి ఎన్నిక‌ల్లో మెజారిటీ సీట్లు సాధించి అధికారాన్ని చేప‌ట్టాలి. కాని ప‌వ‌న్ మాత్రం నేనే సీఎంనంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు క‌ర్నాట‌క ఎన్నిక‌ల‌కు లింక్ ఉంద‌నే చెప్పాలి.

మొన్న‌టి క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో గెలిచిన అసెంబ్లీ స్ధానాల సంఖ్య రీత్యా మొద‌టి, రెండు స్ధానాల్లో నిలిచిన బిజెపి, కాంగ్రెస్ పార్టీల‌ను కాద‌ని మూడో స్దానంలో నిల‌చిన జెడిఎస్ నేతృత్వంలో ప్ర‌భుత్వ ఏర్ప‌డింది. ఏదో స‌మీక‌ర‌ణ‌లు క‌ల‌సి వ‌చ్చి, అదృష్టం కొద్దీ జెడిఎస్ అధినేత కుమార‌స్వామి ముఖ్య‌మంత్ర‌య్యారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ భాజాపాను అధికారం చేప‌ట్ట‌కుండా ఎక్కువ సీట్లు గెలిచిన కాంగ్రెస్ కుమార స్వామికి మ‌ద్ద‌తిచ్చింది.

అప్ప‌టి నుండి మ‌న రాష్ట్రంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను కూడా అదే ప‌ద్ద‌తిలో సిఎం ఎందుకు కాకూడ‌ద‌ని అనుకుంటున్న‌ట్లు క‌న‌బ‌డుతోంది. పార్టీ నిర్మానం చూసుకుంటే జ‌న‌సేన‌ను స్థాపించి ఐదు సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది.ఏదో గాలివాటుగా ఎప్పుడో ఒక‌సారి జ‌నాల్లోకి రావ‌టం మ‌ళ్ళీ కొద్ది రోజులు ఎక్క‌డుంటారో కూడా ఎవ‌రికీ తెలీకుండా ఎటో వెళ్ళిపోవ‌టం ఇంత‌కాలం ప‌వ‌న్ రాజ‌కీయం ఇలానే జ‌రిగింది.

మెగా ఫ్యామిలీ స‌భ్యునిగా సెల‌బ్రిటీ హోదాలో పార్టీ పెట్టారు కాబ‌ట్టే ప‌వ‌న్ కు మీడియా కూడా అంతో ఇంతో ప్రాధాన్య‌త ఇస్తోంది. లేక‌పోతే జ‌నసేన పార్టీని జ‌నాలు ఎప్పుడో మ‌ర‌చిపోయుండే వారన‌టంలో సందేహ‌మే లేదు. పార్టీ పెట్టి ఐదేళ్ళ‌యినా ఇంత వ‌ర‌కూ పార్టీ నిర్మాణ‌మే చేయ‌లేదు. పార్టీ మొత్తం మీద ప‌వ‌న్ త‌ప్ప ఇంకో నేతే క‌న‌బ‌డ‌రు. ప్ర‌జా పోరాట యాత్ర పేరుతో రెండు నెల‌లుగా ప‌వ‌న్ యాత్ర‌లు చేస్తున్న ఒక్క‌రంటే ఒక్క ప్ర‌ముఖ‌ నేత కూడా ఏ పార్టీలో నుండి వ‌చ్చి జ‌న‌సేనలో చేర‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు ఎన్ని సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేస్తుందో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉంది పార్టీ.

ఎన్నిక‌లు ప‌ది నెలల్లోకి వ‌చ్చేసినా ఇంత వ‌ర‌కూ జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసేది వీరే అంటూ జ‌నాలు చెప్పుకోవ‌టానికి ఏ జిల్లాలో కూడా నేత‌లు క‌న‌బ‌డ‌టం లేదు. ఇటువంటి ప‌రిస్ధితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ మ‌ధ్య జ‌రిగే పోరాటంలో ఏదో ఓ 30 సీట్లు గెలుచుకుంటే అదికూడా కాపులు ఎక్కువ‌గా ఉండే ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో ఎక్క‌వ సీట్లు వ‌చ్చి కుమార‌స్వామి లాగ ఇక్క‌డ తాను సిఎం అయిపోవ‌చ్చ‌ని ప‌వ‌న్ అనుకుంటున్న‌ట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -