Monday, May 20, 2024
- Advertisement -

బాబుపై దండయాత్ర..జగన్‌ సక్సెస్?

- Advertisement -

దండయాత్ర…ఇది దయా గాడి దండయాత్ర అంటూ వచ్చే సినిమా డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాలకు సరిగ్గా సెట్ అవుతుంది. దండయాత్ర…ఇది చంద్రబాబుపై దండయాత్ర అంటూ జగన్ అండ్ వైసీపీ నేతలు చేస్తున్న దాడి ముందు టీడీపీ చిన్నబోయిందనే చెప్పాలి. చంద్రబాబు రాజకీయ ఎత్తుగడ పారకపోతే ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఓ వైపు లోకేష్ పాదయాత్ర మరోవైపు బాబు ప్రాజెక్టుల సందర్శన అంటూ వైసీపీని కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలో ఊహించని విధంగా ఐటీ నోటీసుల రూపంలో చంద్రబాబు ఇబ్బందిపడే పరిస్థితి నెలకొంది. బాబు రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడు ఎదర్కోలేదు. అసలే ఎన్నికల సంవత్సరం..ఈ క్రమంలో వైసీపీ నేతలు పక్కా వ్యూహాంతో టీడీపీపై దాడి కొనసాగిస్తున్నారు.

ఈ రాజకీయ క్రీడలో చంద్రబాబుపై జగన్ విజయం సాధించారనే చెప్పాలి. ఎందుకంటే ఐటీ నోటీసులపై టీడీపీ నేతలు కూడా స్పందించలేని పరిస్థితి నెలకొంది. ఐటీ శాఖ పక్కా ఆధారాలతో సహ నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు టీం మౌనమే సమాధానం అనాల్సిన పరిస్థితి. ఇదే అదునుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే బాబు జైలుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. మొత్తంగా వైసీపీని డిఫెన్స్‌లో పడేయాలని చూసిన బాబు తానే డిఫెన్స్‌లో పడ్డారని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -