వైసీపీ అధినేత జగన్ కు గుండెల్లో దడ పుట్టించాడు టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. ఇటివలే ఆయన ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో.. జగన్ కు షాక్ తగిలేలా చేశారు అని లోటస్ పాండ్ వర్గాలు అంటున్నాయి. అసలు సంగతిలోకి వెళ్తే.. కొందరు టీడీపీ నేతలు పార్టీకి సంబంధించిన వ్యూహాలను పట్టించుకోవడం లేదని చంద్రబాబు తల పట్టుకుంటున్నారట. 2019 ఎన్నికల వ్యూహంగా టీడీపీ ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే.
ఈ నెపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీకి కొన్ని లక్ష్యాలు నిర్దేశించారు. కొన్ని కార్య క్రమాలు రూపొందించారు. అయితే కొందరు నేతలు మాత్రం వాటిని సరిగ్గా పాటించడం లేదని.. మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కళా వెంకట్రావు అన్నారు. వాస్తవానికి బాబు చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా కోటి కుటుంబాలను కలిసి వారి కష్టా నష్టాలను తెలుసుకోవాలని బాబు వ్యూహం రెడీ చేసుకున్నారు. దీనిని తానే స్వయంగా శ్రీకాకుళంలో ప్రారంభించారు. దీనికి మంచి స్పందన వచ్చినప్పటికి.. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కొందరు ఎమ్మెల్యేలు పటించుకోవడంలేదు అని వార్తలు వచ్చాయి. వీటిపై కళా స్పందిస్తూ.. అలాంటి వార్తలు నిజమేనని చెప్పడంతోపాటు వాటిని సరిచేస్తామని అన్నారు. 2019లో గెలుపే లక్ష్యంగా తాము దూసుకుపోతున్నామని చెప్పారు.
ఇప్పటికే చేపట్టిన చాలా కార్యక్రమాలు పార్టీకి ప్లస్ అవుతాయని అన్నారు. క్రమంలోనే చంద్రన్న బీమా, నెంబరు 1100, పింఛన్లు వంటివి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నాయని అన్నారు. మరో పక్క పోలవరం, రాజధాని నిర్మాణం, ఉపాధి కల్పన, పెట్టుబడులు ఇలా అన్నీ టీడీపీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలుగానే చెప్పిన ఆయన నంద్యాల, కాకినాడ ల గెలుపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. అదేటైంలో మరికొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీ వైపు చూస్తున్నారని జగన్ గుండెల్లో దడ పుట్టించారు కళా వెంకట్రావు. ఇక ఇటివలే మంత్రి అచ్చన్నాయుడు కూడా ఇదే మాట అన్నారు.