Sunday, May 5, 2024
- Advertisement -

హ‌రీష్‌రావుకు త‌ప్పిన ప్ర‌మాదం…

- Advertisement -

తెలంగాణ ఆప‌ధ‌ర్మ మంత్రి హరీశ్ రావు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు హరీష్ రావు.. సంగారెడ్డి వెళ్లారు. కాగా,… ఈ సమావేశానికి కార్యకర్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు.

మంత్రి రాక సందర్భంగా కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచాను కాల్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కాల్చిన కొన్ని తారాజువ్వలు మంత్రి కాన్వాయ్ పైకి దూసుకొచ్చాయి. భారీగా టపాసులు పేల్చడంతో ఈ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకోగా, రాకెట్లు తగిలి కొన్ని వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఊహించని పరిణామంతో భయబ్రాంతులైన కార్యకర్తలు.. అక్కడి నుంచి పరుగులు తీశారు. కాగా.. ఈ ఘటనలో హరీష్ రావు కి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -