Monday, April 29, 2024
- Advertisement -

వైసీపీలోకి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ కీల‌క నేత‌

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేప‌ట్టిన‌ప్ప‌టినుంచి ఆపార్టీకి ప్ర‌జ‌ల‌లో మ‌ద్దుత అనూహ్యంగా పెరుగుతోంది. మ‌రో వైపు పార్టీలోకి ముఖ్య‌నాయ‌కుల చేరిక‌ల‌తో పార్టీ బ‌లం పుంజుకుంటోంది. పాద‌యాత్ర గుంటూరు జిల్లా న‌ర్స‌రావు పేట‌లో జ‌గ‌న్ స‌భ‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. అందునా ఆ నియోజ‌క వ‌ర్గం స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌ రావు ది కావ‌డం గ‌మ‌న‌ర్హం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను ఓడించేందుకు జ‌గ‌న్ భారీ ప్లాన్ వేశారు. 2014 ఎన్నిక‌ల్లో వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుపై కోడెల ఏడువందల చిల్లర ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సత్తెనపల్లిలో జగన్ పాదయాత్రకు వచ్చే స్పందన ఆసక్తిదాయకంగా మారింది.

న‌ర్స‌రావుపేట‌ల పాద‌యాత్ర‌లో భాగంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో కోడెల కుటుంబంపై జగన్ తీవ్రమైన విమర్శలు చేసారు.. ఇక్కడ ఏ పని చేయాలన్నా.. కోడెల టాక్స్ కట్టాల్సి వస్తోందని జగన్ వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ నేత నిమ్మకాయల రాజనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో కోడెల ఈ నియోజ‌క వ‌ర్గంలో పోటీచేడంతో నిమ్మ‌కాయ‌ల‌కు ఛాన్స్ ల‌భించ‌లేదు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న‌కు టికెట్ వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డంలేదు. దీంతో టీడీపీకీ రాజీనామా చేసి వైసీపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -