అసెంబ్లీలో లాబీలో హైడ్రామా చోటు చేసుకుంది. గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్థభనేని వంశీ తన పదవికి రాజీనామా చేశారనె వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొన్నాల్లుగా డెల్ట్ షుగర్స్ సంస్థ విషయంలో అధిష్టానంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.
డెల్ట్ షుగర్స్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన సీఎం ఆఫీసులో కన్నీటి పర్యంత మవడంతోపాటు రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు సమర్పించేందుకు ఆయన అసెంబ్లీకి వెల్లారు.
దీంతో విషయం తెలుసుకున్న మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్… వల్లభనేని వంశీని ఆపి, రాజీనామా లేఖను చించేశారు. వెంటనే ఈ విషయం మంత్రా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో, వంశీని బుజ్జగించే బాధ్యతను మంత్రి కళా వెంకట్రావుకు అప్పగించారు లోకేష్.
హనుమాన్ జంక్షన్ లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు నెలలుగా మూతపడింది. దీన్ని తణుకుకు మార్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని… ఇక్కడ నుంచి తరలిస్తే, ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
గతంతలో చెరుకు రైతులతో కలసి ఆయన సీఎంను కలసి, వినతి పత్రం అందించారు. తాజగా ఈ రోజు కూడా ఈ విషయంపై చర్చించేందుకు రైతులతో కలసి సీఎం కార్యాలయానికి వంశీ వచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆయనతో సీఎం కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా గిరిజా శంకర్ ఆయనతో సరైన రీతిలో వ్యవహరించలేదని తెలుస్తోంది. దీంతో వంశీ తీవ్ర మనస్తాపానికి లోనై, రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామాతో అసెబ్లీలో హైడ్రామా చోటు చేసుకుంది.