ఎమ్మెల్యే రోజా.. ఎప్పుడు టీడీపీ నేతలను విమర్శంచడంలో ముందు ఉంటారు. ఆమె టైం దొరికినప్పుడల్లా.. టీడీపీపై మండిపడుతుంది. సందర్భం ఏదైన సరే తన మాటల తగ్గించదు. రోజా ఎలా అయితే విమర్శలు చేస్తుందో.. అలానే రోజా పై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటారు.
ఇక ఇక నంద్యాల ఉపఎన్నికలలో అధికార ,విపక్షాలు మాటల తూటాలు పేల్చాయి. ఒకరికొకరు గుండు కొట్టించుకోవాలి అనేదాకా పరిస్థితి వెళ్ళింది. నంద్యాల ఉపఎన్నికలో విజయం అధికార పార్టీకి దక్కడంతో.. ఆ పర్టీ నాయకులు.. ఎమ్మెల్యే రోజా ఫోటోలు మార్ఫింగ్ చేసి గుండులోకి మార్చేశారు. అప్పట్లో ఇది పెద్ద వివాదస్పద మయింది. అయితే ఈ విషయంపై రోజా పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇటర్వ్యూలో ఆమె దీనిపై మాట్లాడింది. ఈ విషయంలో.. టీడీపీ నేతలపై రోజా ఓ రేంజ్లో ఫైరయింది.
తనను వల్గర్గా ఎవరైతే చూపించారో వాళ్లని బూతులు తిట్టారు. చేతకాని దద్దమ్మలు ఇలా చేస్తారని, దమ్ముంటే పొలిటికల్గా ఫైట్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. వల్గర్ గా మెసేజ్ లు, ఫోటోలు పెట్టడం బాధగా వుందన్నారు. ఇలాంటి ఫోటోలు తన పిల్లలు చూస్తే పరిస్థితి ఏంటంటూ రుసరుసలాడింది.