నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి హీటెంక్కించేసారు. బహిరంగ సభలో పాల్గొనటం ద్వారా జగన్ వైసీపీ అభ్యర్ధి శిల్పామోహన్ రెడ్డి తరపున గురువారం ప్రచారానికి దిగినట్లైంది. బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసి మంత్రి వర్గంలో కలవరం మొదలయ్యింది.
చంద్రబాబునాయుడు అద్యక్షతన రెండు గంటల పాటు జరిగన సమావేశంలో చర్చ ప్రధానంగా ఉపఎన్నికపైనే జరిగింది. అంటే, ప్రభుత్వంలో నంద్యాల ఉపఎన్నిక ఏస్ధాయిలో కలవర పెడుతోందో అర్ధమైపోతోంది. అందులోనూ ప్రదానంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కదలికలపైనే నిరంతర నిఘా వుంచాలని కూడా సమావేశంలో నిర్ణయించారట.
నంద్యాలలోని ఎస్పీజి గ్రౌండ్ లో జరుగనున్న బహిరంగసభకు జనాలు ఇప్పటికే పోటెత్తారు. నియెజకవర్గంలోనే కాకుండా ఆళ్ళగడ్డ తదితర ప్రాంతాల నుండి జనాల పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వంలో నంద్యాల ఉపఎన్నిక ఏస్ధాయిలో కలవర పెడుతోందో అర్ధమైపోతోంది.
ఉపఎన్నిక విషయంలో వైసీపీ ప్రధానంగా జగన్ కదలికలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందేట్లు ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారట. నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. కాబట్టి ఒక్క ఓటు కూడా వైసీపీకి పోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు.
ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించటంతో పాటు యావత్ మంత్రివర్గమే కాకుండా 35 మంది ప్రజాప్రతినిధులను నియోజకవర్గంలో దింపిన తర్వాత కూడా చంద్రబాబులో ఇంత కలవరం కనబడుతోందంటే ఆశ్చర్యంగానే ఉంది.