విశాఖ ఏయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద జరిగిన దాడిపై ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రంగా స్పందించారు. ఆ కత్తికి విషం పూసి ఉంటే పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పై చిన్న చాకుతో దాడి చేశారని కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయని… ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే, దాన్ని చిన్న విషయంగా తీసి పారేస్తారా? అని మండిపడ్డారు.
అత్యంత భద్రత కలిగిన ఎయిర్పోర్టులో సెక్యూరిటీ లేదు అనడానికి ఇదొక నిదర్శనమని రోజా ఆరోపించారు. ప్రతిపక్షనేతకే భద్రత నేతకు భద్రత లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని రోజా ప్రశ్నించారు. అక్కడుంది లోకల్ పోలీసులు కాబట్టి మాకేం సంబంధం లేదని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. గతంలో ప్రత్యేకహోదా ఉద్యమంలో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన జగన్ను రన్వేపైనే అరెస్ట్ చేశారని రోజా గుర్తు చేశారని గుర్తు చేశారు.
దాడి వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందని… ఈ దాడికి యత్నించిన వ్యక్తిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రతిపక్ష నేతకే రక్షణ లేకపోతే… సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.