Monday, April 29, 2024
- Advertisement -

గులాబీ హీరోయిన్ మ‌హేశ్వ‌రి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

- Advertisement -

మేఘాలలో తేలిపొమ్మన్నది,తూఫానుల రేగిపోమ్మన్నది అనే పాట ఎంతా ఫాపులరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో యూత్ ని తెగ ఆకట్టుకుంది గులాబి మూవీ. డైరెక్టర్ కృష్ణవంశీకి,హీరో జెడి చక్రవర్తికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అంటూ ఈ సినిమాతోనే పరిచయం అయింది సింగర్ సునీత. గులాభి సినిమా అంటే ముందుగా గుర్తొచ్చిదే హీరోయిన్ మహేశ్వరి.

తన అందం, అభినయం, హస్కీ వాయిస్, అల్లరి.. కళ్లు.. అనేక అంశాలతో ఆకట్టుకున్న మహేశ్వరి అప్పట్లో కుర్రాళ్ల మతి పోగొట్టింది. ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ అయినటువంటి శ్రీదేవికి చెల్లెలవుతుంది మహేశ్వరి. గులాభితో మంచి హిట్ కొట్టినప్పటికి ఆ తర్వాత పెద్దగా హిట్స్ అందుకోలేకపోయింది. రవితేజతో నటించిన నీకోసం సినిమా లో నటనకుగానూ నంది అవార్డు అందుకుంది. ఇక ఆ తర్వాత హిట్స్ పెద్దగా లేకపోవడంతో.. సినిమాలకు గుడ్ బై చెప్పి.. బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. మై నేమ్ ఈజ్ మంగతాయారు అంటూ వచ్చిన సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందింది. అప్పట్లో జెడి మహేశ్వరిని పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారని వార్తలు వచ్చాయి.

తర్వాత మహేశ్వరి జై క్రిష్ణన్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆడవాళ్లల్లో మార్పు రావడం సహజం.కానీ కొందరిలో మాత్రం అప్పటి పోలికలు లేకుండా వీళ్లేనా వాళ్లు అన్నట్టుగా తయారవుతారు.మహేశ్వరి కూడా పెళ్లి తర్వాత అప్పటి పోలికలు లేకుండా తయారయింది. మహేశ్వరి చేత శ్రీదేవి హైదరాబాద్ లో ఒక బొటిక్ ఓపెన్ చేయించింది,మహేశ్వరి ఫ్యాషన్ కలెక్షన్స్ పేరిట ఒక స్టోర్ ని నడుపుతుంది. అక్కలా సినిమాల్లో లక్ కలిసి రాలేకపోయినా,కనీసం ఫ్యాషన్ డిజైనర్ గా అయినా క్లిక్ అవుతుందా లేదా వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -