దేశంలో ప్రధాని మోడీ చేసిన నోట్ల రద్దు తో చిల్లర దొరకాక చాలా మంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఏటీఎం వద్ద లైన్ లో నిలబడలేక.. ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో అన్ని షాపుల దగ్గర పేటిఎం మొదలు పెట్టారు. దాంతో తమకు కావాల్సింది తీసుకొని పేటిఎం ద్వారా డబ్బు చెల్లించవచ్చు.
దాంతో ఈ పేటిఎం మరింత పాపులర్ అయ్యింది. పేటిఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ తాజాగా ఒక పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఇప్పటి వరకు చేస్తున్న వాలెట్ బిజినెస్ ను పేమెంట్ బ్యాంకుగా మార్చనుంది. మీ పేటిఎం వేలెట్ లో ఉన్న మనీ మీరు మీ బ్యాంకు అకౌంట్ లోకి ఈ నెల 15 లోపు ట్రాన్స్ ఫర్ చేయకపోతే మీ మనీ పే టిఎం బ్యాంకు అకౌంటులోకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. అయితే గత ఆరు నెలలనుంచి పే టిఎం ఉపయోగించని వారికి, జీరో బ్యాలన్స్ ఉన్నవారికి ఈ నోటీసు వర్తించదు. ఈ బ్యాంకు లాంచ్ చేసిన సంవత్సరం లోపు 200 మిలియన్ల అకౌంట్లు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా పే టిఎం అధినేత విజయ్ శేఖర్ ప్రకటించారు.
Related
