Monday, April 29, 2024
- Advertisement -

నారా వారి ‘నిప్పు’…… ముట్టుకున్న అందరినీ తగలబడేలా చేస్తోందా?

- Advertisement -

నారా చంద్రబాబు నాయుడి గురించి వైఎస్ రాజశేఖరరెడ్డికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో. చంద్రబాబు మాటలు ఎలా ఉంటాయో…. తెరవెనుక చేతలు ఎలా ఉంటాయో వైఎస్సార్ అద్భుతంగా విశ్లేషిస్తూ విడమరిచి చెప్పేవాడు. ఇక చంద్రబాబు లెగ్ మహిమ గురించి కూడా చాలానే చెప్పాడు వైఎస్సార్. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఆంద్రప్రదేశ్‌కి కలిసొచ్చింది ఏమీ లేదు. హోదా పోయింది….ప్యాకేజ్‌కి గతి లేదు…. రైల్వే జోన్‌కి అతీ గతీ లేదు….. రాజధాని నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది. అసలే పేద రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ అప్పులను మాత్రం 2లక్షల కోట్లకు దాటించడంలో సక్సెస్ అయ్యాడు చంద్రబాబు. అవినీతిలో నంబర్ ఒన్, దళితులపై దాడుల విషయంలో, మహిళలపై అరాచకాల విషయంలో నంబర్ ఒన్ అని అధికార సర్వేలే చెప్తున్నాయి. ఇక వర్షాలు కూడా ఒక్క సారి కూడా ఆశించిన మేరకు పడిందిలేదు.

ఆ విషయాలు పక్కనపడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్స్‌గా చంద్రబాబు నియమించిన వాళ్ళ అందరి జీవితాలు తల్లకిందులు అవుతూ ఉండడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఒకరిద్దరు విషయంలో అలా జరిగి ఉంటే ఆశ్ఛర్యపోవాల్సింది ఏమీ లేదు కానీ బాబు చేతుల మీదుగా బ్రాండ్ అంబాసిడర్స్‌గా నియమించబడ్డ అందరి చరిత్రలూ తల్లకింద్రులవుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యేలేట్ అవుతున్న సమాచారం మాత్రం ఆలోచింపచేసేలా చేస్తోంది.

నిప్పు చేతుల మీదుగా బ్రాండ్ అంబాసిడర్ అయిన వారంతా వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తొలుత “అజయ్‌ దేవగన్‌ను” చంద్రబాబు ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించేందుకు రెడీ అయ్యారు. ప్రకటన కూడా వచ్చింది. ఇంతలో పనామా పేపర్లలో ఆయన పేరు బయటకు రావడంతో అంతా బిత్తరపోయారు. అజయ్‌ దేవగన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించే ఆలోచన నిప్పు విరమించుకున్నారు.

“గజల్ శ్రీనివాస్” కూడా ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన వారే. కానీ ఆయన తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగులతో రాచకార్యాలు నడుపుతూ అడ్డంగా దొరికిపోయారు. దాంతో ఆయన పరువుపోయింది. రాష్ట్రప్రభుత్వం పరువు పోకుండా నిప్పు వెంటనే ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించారు.

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా “పూనం కౌర్”ను నియమించింది. అజ్ఞాతవాసి సిపార్సుతోనే ఆ నియామకం జరిగిందని అప్పట్లోనే ఆంగ్ల మీడియాలో వార్తలొచ్చాయి. ఇప్పుడు హఠాత్తుగా ఆమె కూడా పవన్‌తో సంబంధాల విషయంలో వివాదాస్పదమైపోయారు.

దీంతో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌ పోస్టుకేమైనా దోషం ఉందా లేకపోతే నిప్పు శాపమా? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -