- Advertisement -
భగవంతునికి సాష్టాంగ నమస్కారం పురుషులు చేయవచ్చు. తమ ఎనిమిది అంగాలను అనగా వక్షస్థలం,నుదురు,రెండు చేతులు,రెండు కాళ్ళు, రెండు కనులు భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు.
కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలని అనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భ కోశం ఉంటుంది. ఇలా చేయుట వలన గర్భ కోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుంది.
అందుకే ఇతిహాసాల్లో ధర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చేయగల్గితే నడుం వంచి ప్రార్ధించవచ్చు.