Friday, May 3, 2024
- Advertisement -

ప్రతీకార విజయం సాధించిన డేర్‌ డెవిల్స్‌

- Advertisement -

ఐపీఎల్ 2018 నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ డేర్‌ డెవిల్స్ ప్ర‌తీకార విజ‌యం సాధించింది.టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ రిషబ్‌ పంత్‌ 69 , శ్రేయస్‌ అయ్యర్‌ 50, పృథ్వీషా 47 లు చెలరేగడంతో 17.1 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం రాజస్తాన్‌ లక్ష్యాన్ని 12 ఓవర్లకు 151 పరుగులుగా నిర్ధేశించింది.

ఈ లక్ష్యఛేదనలో రాజస్తాన్‌ అనూహ్యంగా జోస్‌ బట్లర్‌ను ఓపెనర్‌గా పంపింది. బట్లర్‌, డీఆర్కీషార్ట్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బ్యాట్స్‌మెన్‌లు దూకుడుగా ఆడే క్రమంలో వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. నిర్ణీత ఓవర్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ 5వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది.ఢిల్లీ 4 పరుగుల తేడాతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -