టీమిండియా – దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.ఆసీస్తో సిరీస్ను 4-1 తేడాతో గెలిచిన సూర్య కుమార్ సేన..సఫారీలను చిత్తు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. డర్బన్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో ఈ సిరీస్కు కూడా సూర్యకుమార్ యాదవే కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఆసీస్తో టీ20లకు దూరంగా ఉన్న శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ జట్టుతో కలియనున్నారు.
టీమిండియా జట్టు ఇదే..
యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ముఖేష్ కుమార్, వాషింగ్టన్ సుందర్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్.