- Advertisement -
రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో టీమిండియా 307 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 219/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 88 పరుగులు జోడించి ఆలౌట్ అయింది.
యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్ 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు. తృటిలో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లాండ్కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించగా ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ ఐదు వికెట్లు తీయగా టామ్హార్డ్లీ మూడు వికెట్లు, జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ని ప్రారంభించిన ఇంగ్లాండ్ 20 పరుగులకు రెండు వికెట్లు కొల్పోయింది. స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్లో డకెట్ తో పాటు పొప్ ఇద్దరు ఔటయ్యారు.