Monday, May 6, 2024
- Advertisement -

టెస్ట్‌సిరీస్ మొద‌లు కాక‌ముందే టీమిండియాకు ఎదురు దెబ్బ‌..

- Advertisement -

ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై ప్రస్తుతం ఎసెక్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన అశ్విన్ కనీసం ఒక ఓవర్ కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. అతని చేతికి తీవ్రమైన గాయం కావడంతో.. మైదానం నుంచి పెవిలియన్‌కి వెళ్లిపోయిన అశ్విన్.. మళ్లీ ఫీల్డింగ్‌కి రాలేదు.

ఇప్పటికే గాయాలతో కీలక పేసర్లైన భువనేశ్వర్‌ కుమార్ సిరీస్‌ మొత్తానికి దూరం కాగా.. జస్ప్రిత్‌ బుమ్రా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గాయపడ‌టం టీమిండియాకు క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఈ నేపథ్యంలో.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా జట్టుకి దూరమైతే అది కచ్చితంగా భారత్‌కి గట్టి ఎదురుదెబ్బ.

అశ్విన్ విష‌యంలో ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రంలేద‌ని జట్టు మేనేజ్‌మెంట్‌ వెల్లడించినా.. అశ్విన్‌ ఆడటంపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే కీలక బౌలర్ల గాయాలతో బలహీనమైన బౌలింగ్‌ విభాగం అశ్విని గైర్హాజరుతో మరింత బలహీనం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -